సీఎం కేసీఆర్‌ షాక్‌.. కాంగ్రెస్‌ లోకి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం..!

-

సీఎం కేసీఆర్‌ షాక్‌ బిగ్‌ షాక్‌ తగులనుంది. కాంగ్రెస్‌ పార్టీలోకి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వెళ్లనున్నారు. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం….కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇందులో భాగంగానే, ఇవాళ పీసీసీ చీఫ్ రేవంత్ తో వేముల వీరేశం భేటీ అయ్యే ఛాన్స్ ఉంది.

పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, జూపల్లి కృష్ణా రావులతో కలిసి నడిచేందుకు సిద్ధయ్యారు వేముల వీరేశం. ఇవాళ్టి రేవంత్ భేటీలో పొంగులేటి తో పాటు వీరేశం ఉండే ఛాన్స్‌ ఉంది. మూడు రోజులుగా హైద్రాబాద్ లోనే మకాం వేశారు వేముల వీరేశం. నకిరేకల్‌ నియోజకవర్గ నేతలు వెంట లేకుండానే మూడు రోజులుగా హైదరాబాదులో మఖాం వేశారు వేముల వీరేశం. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version