సీఎం రేవంత్‌ను కలిసిన గద్వాల ఎమ్మెల్యే

-

గత నాలుగైదు రోజులుగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్ గురించి చర్చ నడుస్తోంది. ఆయన కాంగ్రెస్లోనే ఉంటారా.. తిరిగి బీఆర్ఎస్లో చేరతారా అన్న దానిపై స్పష్టత లేదు. అయితే ఇటీవల అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆయన కేటీఆర్ను కలిసి పార్టీలో తిరిగి వస్తానని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కేసీఆర్ను కలవాలి అనుకుంటున్నట్లు చెప్పినట్లు తెలిసింది.

అయితే ఆ మరుసటి రోజే అప్రమత్తమైన కాంగ్రెస్ పార్టీ కృష్ణమోహన్ రెడ్డిని సంప్రదించింది. ఈ క్రమంలోనే మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం రోజున ఆయణ్ను కలిశారు. ఇక ఇవాళ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. మంత్రి జూపల్లితో వెళ్లి సీఎంను సంప్రదించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి, అడ్లూరి లక్ష్మణ్‌, మధుసూదన్‌రెడ్డి కూడా ఉన్నారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగునున్నట్లు చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పటికి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఈ విషయంపై ఏ క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version