బీసీ బంధు పథకం నిరంతర ప్రక్రియ..కేసీఆర్‌ సర్కార్‌ ప్రకటన

-

బీసీ బంధు పథకం నిరంతర ప్రక్రియ అని కేసీఆర్‌ సర్కార్‌ ప్రకటన చేసింది. కుల వృత్తులకు జీవం పోసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి కుటుంబానికి లక్ష సాయం అందజేస్తున్నారని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ అన్నారు..నేడు కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో 32 మంది కులవృత్తులకు లక్ష సాయం చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తి చేసుకునే ప్రతి బీసీ కుటుంబం ఆత్మగౌరవం తో బ్రతకాలని అన్నారు…గత ప్రభుత్వల హయాంలో ఇచ్చే రుణాలకు బ్యాంకు గ్యారంటీ లు అడిగేవారు.. తెలంగాణ ప్రభుత్వం అందజేసే లక్ష సాయానికి ఎలాంటి బ్యాంకు గ్యారంటీ లేకుండా అందజేస్తున్నామని వెల్లడించారు. చేతి కుల వృత్తులకు సహాయం చేయాలని ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి లక్ష సాయం. అందజేస్తున్నామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version