నేడు కాంగ్రెస్‌లోకి మేయర్ గద్వాల విజయలక్ష్మి..మరో 10 మంది కార్పోరేటర్లు ?

-

హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం అందుతోంది. ఆమెతోపాటు ఏకంగా 10 మంది హైదరాబాద్ జిహెచ్ఎంసి కార్పొరేటర్లు కూడా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారట. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వీరందరూ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అటు కే కేశవరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారట.

ఆయనతో కూడా కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. కాకా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నుంచి కెసిఆర్ వెంట కే కేశవరావు ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నేతలు చేరారు. గులాబీ బాటలో కీలక పదవులు అనుభవించిన తర్వాత కూడా… పార్టీ మారారు కొంతమంది లీడర్లు. దానం నాగేందర్, పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి లాంటి వారు ఈ కోవాలోకి వస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version