హైదరాబాద్‌లో హోర్డింగులను అనుమతించండి.. ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ విజ్ఞప్తి

-

హైదరాబాద్ మహానగరంలో నగరంలో హోర్డింగులు, ఎల్‌ఈడీ స్క్రీన్స్ ఏర్పాటుకు అనుమతించాలని జీహెచ్‌ఎంసీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. తద్వారా జీహెచ్‌ఎంసీకి ఏటా రూ.100 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపింది. ప్రకటనల ఎత్తివేతపై ఉన్న నిబంధనలను ఉపసంహరించుకోవాలని సర్కార్ కు విన్నవించింది.

ప్రమాదాలు జరుగుతున్నాయంటూ హోర్డింగులపై గత సర్కారు నిషేధం విధించిందని ప్రభుత్వానికి తెలిపింది. దానివల్ల ప్రజలకు ఎంత ప్రయోజనం చేకూరిందో తెలియదుగానీ జీహెచ్‌ఎంసీ ఖజానాపై మాత్రం తీవ్ర ప్రభావం పడిందని జీహెచ్ఎంసీ వివరించింది. రూ.80 కోట్లుగా ఉన్న ప్రకటనల విభాగం వార్షిక ఆదాయం రూ.18 కోట్లకు పడిపోయిందని పేర్కొంది. అలాగే గత సర్కారు హయాంలో యూనిపోల్స్‌, బస్టాపుల్లో ప్రకటనల ఒప్పందాలను పునఃపరిశీలించాలని కోరింది. అందులో అనేక అవకతవకలు జరిగాయని ప్రభుత్వాన్ని కోరిన జీహెచ్ఎంసీ అధికారులు ఎఫ్‌ఓబీలు, ఇతర నిర్మాణాలకు ఏర్పాటు చేసే ఎల్‌ఈడీ తెర ప్రకటనకూ పచ్చజెండా ఊపాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు మెట్రో పిల్లర్లపై ఎల్‌అండ్‌టీ సంస్థ ఏర్పాటు చేస్తోన్న ప్రకటనల రుసుము బకాయి రూ.50 కోట్లకు చేరిందని కూడా తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version