తెలంగాణ డిగ్రీ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త

-

తెలంగాణ డిగ్రీ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 15 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులు చేరడానికి గడువును ఈనెల 14వ తేదీ వరకు పొడిగించామంటూ మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య భట్టు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

వరుసగా సెలవులు రావడంతో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారని వారి అభ్యర్థన మేరకు దరఖాస్తు తేదీని పొడిగించామని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంటర్ మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు.

15 గురుకుల డిగ్రీ కాలేజీల్లో బిఎస్సి, బిజెడ్సి, ఎంపీసీ, కంప్యూటర్ సైన్స్, బిఏహెచ్ ఈపి కోర్సులతోపాటు ఆర్టిఫిషియల్ ఇన్టెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బిబిఏ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జియాలజీ, బిజినెస్ అనలిటిక్స్, జియోగ్రఫీ, డాటా సైన్స్, సోషియాలజీ, సైకాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అండ్ డైట్, ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరిన్ని వివరాలకు 040-23328266, myptbcwreis. telangana.gov.inను సంప్రదించాలని ఆయన సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version