తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త..మరో విడత డీఏ విడుదల

-

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఆర్టీసీ యాజమాన్యం. మరో విడత డీఏ విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు మరో విడత కరువు భత్యం మంజూరు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది.

ఫిబ్రవరి నెల వేతనంతో కలిపి డీఏను చెల్లిస్తామని బుధవారం ప్రకటించింది. సంస్థ తరఫున ఇప్పటికే ఐదు డిఏలను విడుదల చేయగా, వచ్చే నెలలో ఆరో డిఏ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇక ఆర్టీసీ యాజమాన్యం.. తీసుకున్న తాజా నిర్ణయంపై తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తెలంగాణ ఆర్టీసీ కి గత కొన్నిరోజులు ఆదాయం పెరుగుతూ వస్తోంది. ప్రజల కోసం అనేక రకాలుగా అనువుగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ… లాభాల బాట పడుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version