వీఆర్ఏలకు శుభవార్త… ఉద్యోగాలు రెగ్యులరైజ్

-

వీఆర్ఏలకు శుభవార్త చెప్పింది కేసీఆర్‌ సర్కార్‌. ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తూ కీలక ప్రకటన చేసింది సర్కార్‌. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన నూతన సచివాలయంలో తొలిసారి మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్‌ తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మంత్రి హరీశ్‌రావు మీడియా సమావేశంలో వెల్లడించారు.

కులవృత్తులను బలోపేతం చేసేందుకు లక్ష ఆర్థికసాయం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 111 జీవోను పూర్తిగా ఎత్తివేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న గ్రామాలకు ఎలాంటి విధి విధానాలు అమల్లో ఉంటాయో, వారికి కూడా అవే నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. అలాగే.. వీఆర్‌ఏ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తూ కీలక ప్రకటన చేశారు మంత్రి హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version