Telangana: ధరణి సమస్యలపై ప్రభుత్వం ఫోకస్..!

-

ధరణి సమస్యలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ధరణి సమస్యల పరిష్కారం కోసం సచివాలయంలో ధరణి కమిటి సమావేశం నిర్వహించనుంది. ధరణి సమస్యల పరిష్కారానికి నిర్వహించిన డ్రైవ్ పై సమీక్షించనుంది కమిటీ..ధరణి డ్రైవ్ లో పరిష్కరించిన అప్లికేషన్లపై సమీక్షించనుంది కమిటీ.

Government focus on Dharani issues

జూన్ నాలుగు లోగా ఎట్టి పరిస్థితుల్లో ధరణి పెండింగ్ అప్లికేషన్స్ ను క్లియర్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది రేవంత్ రెడ్డి సర్కార్. ధరణిలో మొత్తం 119 తప్పులలో స్పెషల్ డ్రైవ్ తర్వాత 76 తప్పులను పరిష్కరించాల్సి ఉందని గుర్తించింది ధరణి కమిటీ. ప్రభుత్వం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ తర్వాత పరిష్కారమైన లక్ష అప్లికేషన్ల తో పాటు పెండింగ్ అప్లికేషన్ లపై సమీక్ష నిర్వహించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news