Telangana: ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌ కారు బోల్తా..ఆస్పత్రికి తరలింపు!

-

Telangana: కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌ కు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌కు పెను ప్రమాదమే తప్పింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌ కారు బోల్తా కొట్టింది. ఈ ఘటన సమయంలో కారులోనే ఉన్నారు విప్ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌.

Govt. Whip Adluri Laxman’s car overturned

అయితే..ఈ ప్రమాదంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌ తో పాటు కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు.

ఇక గాయపడిన వారిని, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌ ను చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని…దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాగా…ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌…ధర్మపూరి నియోజక వర్గంలో…మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పై విజయం సాధించారు.

Read more RELATED
Recommended to you

Latest news