గ్రూప్ – 1 అభ్యర్థులకు అలర్ట్.. మెయిన్స్ పరీక్షల సమయాల్లో మార్పులు

-

తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష రాసే అభ్యర్థులకు అలర్ట్. మెయిన్స్ పరీక్షా సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది.  అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు జరగాల్సిన ఈ పరీక్ష ఆ రోజే జరగనుండగా.. సమయంలో మాత్రం స్వల్ప మార్పులు చేసినట్లు తెలిపింది. గతంలో నిర్ణయించిన సమయం కన్నా అరగంట ముందుగానే పరీక్ష ప్రారంభం అవుతుందని పేర్కొంది.

తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం నిర్ణీత తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా ఆ సమయాన్ని మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు మార్పు చేసినట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. ఈ మార్పును గమనించి అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది.

గ్రూప్​-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ :

  • జ‌న‌ర‌ల్ ఇంగ్లీష్‌(క్వాలిఫ‌యింగ్ టెస్ట్) – అక్టోబ‌ర్ 21
  • పేప‌ర్ 1(జ‌న‌ర‌ల్ ఎస్సే) – అక్టోబ‌ర్ 22
  • పేప‌ర్ 2(హిస్ట‌రీ, క‌ల్చ‌ర్ అండ్ జియోగ్ర‌ఫీ) – అక్టోబ‌ర్ 23
  • పేప‌ర్ 2 (ఇండియ‌న్ సొసైటీ, రాజ్యాంగం అండ్ గ‌వ‌ర్నెన్స్‌) – అక్టోబ‌ర్ 24
  • పేప‌ర్ 4(ఎకాన‌మి అండ్ డెవ‌ల‌ప్‌మెంట్) – అక్టోబ‌ర్ 25
  • పేప‌ర్ 5(సైన్స్ అండ్ టెక్నాల‌జీ అండ్ డాటా ఇంట‌ర్‌ప్రిటేష‌న్) – అక్టోబ‌ర్ 26
  • పేప‌ర్ 6(తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేష‌న్) – అక్టోబ‌ర్ 27

Read more RELATED
Recommended to you

Exit mobile version