తెలంగాణ ఉద్యోగులకు షాక్‌..10వ తేదీ వచ్చినా పడని జీతాలు !

-

తెలంగాణ ఉద్యోగులకు షాక్‌..10వ తేదీ వచ్చినా ఇంకా కొంత మంది ఉద్యోగుల జీతాలు పడలేదు. తెలంగాణలోని TSWREIS, TTWREIS, TMREIS పరిధిలో ఉన్న 20 వేల మంది గురుకుల ఉద్యోగులకు ఇంకా జీతాలు పడలేదని సమాచారం అందుతోంది. మొదటి తారీకునే ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు వేశామని కాంగ్రెస్‌ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది.

దీంతో నిజమే అనుకుని సంబరపడ్డారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. కానీ వాస్తవంలో ఇంకా ఉద్యోగులకు జీతాలే పడలేదు.10వ తేదీ వచ్చినా ఇంకా కొంత మంది ఉద్యోగుల జీతాలు పడలేదు. మొదట్లో సాంకేతిక కారణం అంటూ సాకు చెప్పి ఇప్పుడు ఫోన్లు ఎత్తలేదట ఉన్నతాధికారులు. దీనిపై గురుకుల సొసైటీ కార్యదర్శిని కలిసేందుకు ప్రయత్నించగా ఆమె తన కార్యాలయానికే రాలేదని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news