ముగిసిన కాళేశ్వరం విచారణ.. హరీష్ రావు షాకింగ్ కామెంట్స్

-

హరీష్ రావు కాళేశ్వరం విచారణ ముగిసింది. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడారు. తుమ్ముడిహట్టి నుండి మేడిగడ్డకు మార్చడానికి గల కారణాలను ఆధారాలతో సహా విచారణ కమిషన్ కు వివరించామని పేర్కొన్నారు. వ్యాప్‌కోస్ సూచన మేరకు, CWC నివేదిక మేరకు, మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడం కారణంగా ఆనాడు బ్యారేజ్ ప్రాంతాన్ని మార్చమని కమిషన్‌కు తెలియజేశానన్నారు హరీష్ రావు.

Harish Rao Kaleshwaram trial ends
Harish Rao Kaleshwaram trial ends

నీళ్ళు లేని చోట కాంగ్రెస్ ప్రాజెక్టును ప్రతిపాదిస్తే, నీళ్ళున్న చోటకి మా ప్రభుత్వంలో మార్చామని వెల్లడించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని… ఆధారాలతో సహా కమిషన్ ముందు జవాబు చెప్పా అంటూ వివరించారు.
తమ్మిడి హట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు ఎందుకు ప్రాజెక్ట్ స్థలాన్ని మార్చారని అడిగారు… మహారాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చల మినిట్స్ ఇచ్ఛానని వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news