విజయవాడలో సాక్షి ఆఫీస్ పై దాడి !

-

సాక్షి ఛానల్ లో కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు చేసిన రచ్చ వివాదంగా మారిన సంగతి తెలిసిందే. అమరావతి రాజధానిని… వేశ్యలతో పోల్చుతూ హాట్ కామెంట్స్ చేశారు. అది కూడా సాక్షి ఛానల్ డిబేట్లో ఈ కామెంట్స్ చేయడంతో ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే సాక్షి ఛానల్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేశారు.

SAKSHI
It is known that the altercation between Kommineni Srinivasa Rao and Krishnam Raju on Sakshi Channel turned into a controversy

ఇక తాజాగా విజయవాడలోని సాక్షి ఛానల్ పైన కొంతమంది అమరావతి సానుభూతి దారులు దాడులు కూడా చేశారు. సాక్షి ఛానల్ పేరు పీకేసి.. రచ్చ రచ్చ చేశారు. విజయవాడ సాక్షి ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి.. నిరసన తెలిపారు. అమరావతి ప్రాంతాన్ని కించపరిచేలా చర్చ నిర్వహించడంపై నిరసనలు చేశారు. అటు ఈ సంఘటనపై.. కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news