ఏపీలో మరో బాలికపై అత్యాచారం చేసిన యువకుడు

-

ఏపీలో బాలికపై అత్యాచారం చేసాడు ఓ యువకుడు. ఆలస్యంగా వెలుగులోకి ఈ ఘటన వచ్చింది. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా భీమునిపట్నంలో ఓ బాలికపై యువకుడు అత్యాచారం జరిగింది. విజయనగరం పట్టణానికి చెందిన బాలిక భీమిలిలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ పదో తరగతి వరకు చదువుకుంది.

A girl was raped by a youth in Bhimunipatnam, Visakhapatnam district
A girl was raped by a youth in Bhimunipatnam, Visakhapatnam district

ఈ క్రమంలో బాలికకు.. హేమలత అనే మహిళతో పరిచయం ఏర్పడగా, చేపల తిమ్మాపురంలో రాడ్ బెండింగ్ పనులు చేస్తున్న నూకరాజుకు పరిచయం చేసింది. ఉపాధి చూపిస్తానని నమ్మబలికి ఇంటికి తీసుకువెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు నూకరాజు. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరున జరిగిన ఈ ఘటనపై శనివారం భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. బాలికను వైద్య పరీక్షలకు తరలించి.. నూకరాజు, అతడికి సహకరించిన హైమావతిపై పోక్సో నమోదు చేసిన పోలీసులు… కేసును విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news