BREAKING : జూబ్లీహిల్స్ పరిధిలో రూ.90 లక్షలు పట్టివేత

-

మునుగోడు ఉపఎన్నిక సమీపిస్తోంది. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎలాగైన మునుగోడు పీఠాన్ని దక్కించుకోవాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కొందరు నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నగదు పంచుతున్నట్లు సమాచారం.

మునుగోడు ఉపఎన్నిక వేళ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీగా నగదు పట్టుబడుతోంది. తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని రోడ్ నంబర్ 71లో ఓ కారులో రూ.90 లక్షల నగదు తరలిస్తుండగా వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతణ్ని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version