రాజన్న సిరిసిల్ల జిల్లాలో హృదయ విధారకమైన ఘటన..!

-

సాధారణంగా ఈ మధ్య కాలంలో రోజు రోజుకు చాలా చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ఎక్కడ ఏ సంఘటన జరిగినా చిటికెలో ప్రపంచం అంతటా తెలిసిపోతుంది. అందులో కొంచెం మంచి ఉంటే.. కొన్ని ఘటనలలో చెడు కూడా ఉంటుంది. కానీ తాజాగా ఓ హృదయ విధారకమైన ఘటన చోటు చేసుకుంది. ఇలాంటి ఘటనలు మాత్రం తప్పకుండా ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిందే.

ప్రధానంగా బ్రతికుండగానే స్మశాన వాటికలో తన మేనత్తను వదిలి వెళ్లాడు మేనల్లుడు. ఈ సంఘటన  రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో చోటు చేసుకుంది.  కూకట్ల రాజవ్వ (70) అనే వృద్ధురాలిని బ్రతికుండగానే స్మశాన వాటికలోని వరండాలో వదిలి వెళ్లిన మేనల్లుడు కూకట్ల తిరుపతి. ఆకలితో అలమటిస్తూ కొన ఊపిరితో ఉన్న వృద్ధురాలిని కాపాడారు సంబంధిత అధికారులు.  వృద్ధు రాలికి కొడుకులు, బిడ్డలు లేకపోవడంతో మేనల్లుడి ఇంటి వద్ద ఉంటుంది రాజవ్వ. మేనల్లుడు తిరుపతికి కౌన్సిలింగ్ ఇచ్చి వృద్ధురాలు రాజవ్వను తిరిగి ఇంటికి పంపించారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version