భర్త సినిమాకి తీసుకెళ్లలేదని..భార్య ఆత్మహత్య !

-

వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంగెం గ్రామానికి చెందిన రాజు(22),స్వాతి (20) ప్రేమించుకున్నారు. ఫిబ్రవరిలో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. తరువాత ఇరువైపులా ఒప్పించారు. రెండు నెలల కిందట శంకర్ పల్లి పట్టణంలోని భవాని నగర్ లో గది అద్దెకు తీసుకొని కాపురం ఉంటున్నారు. రాజు హోటల్ లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్లాలని భార్య కోరగా రాజు నిరాకరించాడు. గురువారం తీసుకెళతానని చెప్పాడు.

ఈ విషయంలో చిన్నపాటి గొడవ జరగ్గా.. మనస్తాపానికి గురైన స్వాతి గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. సమాచారం అందుకొని వచ్చిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version