సిద్దిపేటలో దారుణం…ట్రాన్స్ జెండర్ గా మారి భర్త దారుణం..చివరికీ !

-

 

సిద్దిపేటలోని బోయిగల్లీలో దారుణం చోటు చేసుకుంది. భర్త ట్రాన్స్ జెండర్ గా మారి వేధిస్తున్నాడని సుపారి ఇచ్చి హత్య చేయించింది భార్య. ఆలస్యంగా వెలుగులోకి ఈ సంఘటన వచ్చింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే…. 2014లో వేద శ్రీ, వెంకటేష్ కి వివాహం కాగా 2015 లో ఓ పాప జన్మించింది. 2015 తర్వాత వెంకటేష్ ప్రవర్తనలో మార్పులు వచ్చాయట. చీర కట్టడం, చెవులకు కమ్మలు పెట్టడం, గాజులు తొడుక్కోవడం వంటివి చేశాడట వెంకటేష్.

ఇక 2019లో ట్రాన్స్ జెండర్ గా మారి తన పేరును రోజాగా మార్చుకున్నాడట వెంకటేష్. అప్పటి నుంచి భార్య వేద శ్రీ ని వేధించడం మొదలుపెట్టాడు వెంకటేష్. తన భర్తని హత్య చేయించాలని 2023 సెప్టెంబర్ లో రమేష్ కి 18 లక్షలకి సుపారి ఇచ్చింది అతని భర్త. అడ్వాన్స్ కింద 4.60 లక్షల రూపాయలు చెల్లింపు చేసింది. గత ఏడాది 2023 డిసెంబర్ 11న వే వెంకటేష్ ని మద్యం తాగించి హత్య చేశాడు రమేష్. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేశారు. దీంతో అసలు విషయం బయట పడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version