లంచం తీసుకునేవారు తప్పించుకోలేరు.. ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఆసక్తికర పోస్ట్..!

-

లంచం తీసుకునే వారిని ట్రాప్ చేసేందుకు ఎప్పటికప్పుడు ప్రణాళికలు మార్పు చేశామని.. అలాంటి వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అవినీతి శాఖ నుంచి తప్పించుకోలేరని ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ తెలిపారు. లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఘటనపై ట్విట్టర్ వేదిక గా స్పందించారు.

ముఖ్యంగా లంచం తీసుకునే వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అవినీతి నిరోధక శాఖ అధికారుల నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేసారు. నిన్న రాత్రి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు చెందిన జాయింట్ కలెక్టర్ ఎం.వీ. భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి రూ.8లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి శాఖ అధికారులకు చిక్కారని తెలిపారు. 14గుంటల భూమిని ధరణీ పోర్టల్ లో నిషేదిత భూముల జాబితా నుంచి తొలగించుటకు సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా.. పట్టుబడ్డారని, ఆ మొత్తాన్ని జాయింట్ కలెక్టర్ కి అందజేశారని పేర్కొన్నారు. ఫిర్యాదు దారుడి నుంచి నగర శివార్లలో డబ్బు తీసుకోవడం, ఆపై ఓఆర్ఆర్ దగ్గర జాయింట్ కలెక్టర్ కి అందేలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏసీబీ టీమ్స్ రాత్రి అంతా చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరినీ ట్రాప్ చేసి రెడ్ హ్యండిగ్ గా పట్టుకున్నారని సీవీ ఆనంద్  తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version