పులి బయటికి వస్తే బోనులో పెట్టి బొంద పెడతాం : సీఎం రేవంత్ రెడ్డి

-

కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతిపరులను, కోటీశ్వరులను కేసీఆర్ రాజ్యసభకు పంపించారు. పులి బయటికి వస్తుందంటున్నారు. వస్తే బోనులో పెట్టి బొంద పెడతాం. అభ్యర్థులను మార్చితే గెలిచే వాళ్లమని గొప్పలు చెప్పుకుంటున్నారు. మార్చాల్సింది. అభ్యర్థులను కాదు.. కేసీఆర్ కుటుంబాన్ని అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

కేసీఆర్ కుటుంబం పోటీ చేసే సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటలను మార్చాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు తనను గుంపు మేస్త్రి అంటూ సంబోదించడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అవును నేను మేస్త్రీనే అని అన్నారు. తెలంగాణను పునర్‌నిర్మించే మెస్ట్రీనే అని బీఆర్ఎస్ పవర్ ఫుల్ పంచ్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ గోరి కట్టేందుకు వచ్చిన మేస్త్రిని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version