కాంగ్రెస్ సర్కార్ బీజేపీ కుట్ర చేస్తుందని కేసీఆర్ అనడం సరికాదు : ఎంపీ లక్ష్మణ్

-

బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. శుక్రవారం సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీ లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని కేసీఆర్ అనడం సరికాదని, ఆ ఆలోచన మాకు లేదన్నారు.

ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతారని సంచలన వ్యాక్యలు చేశారు. బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ పయణిస్తుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. సికింద్రాబాద్ బీజేపీకి కంచుకోట అని.. ఇక్కడ కమలం పార్టీ గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ ప్రజల తలలో నాలుకలా కిషన్ రెడ్డి పని చేశారని రాబోయే ఎన్నికల్లో సికింద్రాబాద్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మచ్చుకైనా ప్రభావం చూపయన్నారు. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ గెలుపు దిశగా పయణిస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version