విలేకరీని బెదిరించిన కాంగ్రెస్ నేత పై జేఏసీ జర్నలిస్టులు ఎస్పీకి వినతి

-

ఇటీవలే ఓ కాంగ్రెస్ నేత TV9 రిపోర్టర్‌ను హత్య చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా TV9 రిపోర్టర్‌ను కాంగ్రెస్ నేత హత్య చేస్తానంటూ చేసిన బెదిరింపులపై ఎస్పీకి వినతిపత్రం ఇచ్చింది జర్నలిస్టు జేఏసీ. అయితే ఆదిలాబాద్ – టీవీ 9 రిపోర్టర్ నరేష్ ఒక వార్త రాస్తే.. దానిపై కోపమైన నియోజకవర్గ ఇంచార్జి కంది శ్రీనివాస్ రెడ్డి చంపుతానంటూ బెదిరించాడు.

అలాగే తన అనుచరులను జర్నలిస్ట్ నరేష్ ఇంటి ఆచూకీ తెలుసుకునేందుకు పంపించినట్టు సమాచారం.  దీనిపై తమకు తాము ఏ రాజకీయ పార్టీకి, ఏ నాయకునికి వత్తాసు పలకకుండా నిష్పక్ష పాతంగా వార్తలు రాస్తున్నమని.. జర్నలిస్టుల పై కావాలని కొందరు నాయకులు బెదిరింపులు, భౌతిక దాడులు దిగేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు.  ఇలాంటి చర్యలను అరికట్టాలని జర్నలిస్టు జేఏసీ నాయకులు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ అలంని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఇందుకు ఎస్పీ స్పందించి వారిపై  తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version