కామారెడ్డిలో దారుణం.. భర్తను కొట్టి.. భార్యకు ఉరేసి

-

కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండలం రైతునగర్‌లో దారుణం జరిగింద. మంగళవారం అర్ధరాత్రి వేళ ఇంట్లో ఉన్న దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు దారణంగా హత్య చేశారు. రైతు నగర్‌కు చెందిన నారాయణ గుప్తా-సులోచనదేవీ దంపతులు స్థానికంగా కిరాణా దుకాణం నడుపుతుంటారు. దంపతులు స్థానికంగా వడ్డీకి అప్పులిస్తుంటారు. మంగళవారం రాత్రి భార్యాభర్తలు నిద్రిస్తుండగా…. గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. పడక గదిలో ఉన్న నారాయణపై దాడి చేసి, దారుణంగా హత్య చేశారు. సులోచనకు ఉరేసి, చంపేశారు. ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గ్రామంలో భయాందోళనకు గురిచేసింది.

బాన్సువాడ, బీర్కూర్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. విచారణ జరుపుతున్నారు. క్లూస్‌టీంను రంగంలోకి దించి.. హత్యకు సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్నారు. నారాయణ-సులోచన దంపతులకు పిల్లలు కూడా లేకపోగా.. కిరాణా దుకాణం, వడ్డీలకు డబ్బులిస్తూ జీవిస్తున్నారు. డబ్బుల కోసమే వీరిని ఎవరైనా హత్య చేశారా…. అనే కోణంలో విచారణ సాగుతోంది. లేదా దొంగలేమైనా దొంగిలించడానికి వచ్చి హత్యకు పాల్పడి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version