మోడీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం పెట్టిన BRS

-

మోడీ సర్కార్ కు బీఆర్‌ఎస్‌ పార్టీ ఊహించని షాక్‌ ఇచ్చింది. మోడీ సర్కార్ పై లోక్‌ సభలో ఇవాళ అవిశ్వాస తీర్మానం పెట్టింది BRS పార్టీ. ఈ మేరకు “అవిశ్వాస తీర్మానం” నోటీసు ఇచ్చారు లోకసభ బిఆర్ఎస్ నాయకుడు నామా నాగేశ్వరరావు. “అవిశ్వాస తీర్మానం” నోటీసుపై ఇవాళ చర్చ జరుగాలని.. దీనిపై ఓటింగ్‌ కూడా జరుగాలని.. ఈ సందర్భంగా స్పీకర్‌ ను కోరారు లోకసభ బిఆర్ఎస్ నాయకుడు నామా నాగేశ్వరరావు.

ఇది ఇలా ఉండగా, అటు విపక్షాల కూటమి ‘ఇండియా’లో కొన్ని పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. లోక్‌ సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ విపక్షాల కూటమి ‘ఇండియా’ కంటే ముందే.. మోడీ సర్కార్ కు బీఆర్‌ఎస్‌ పార్టీ ఊహించని షాక్‌ ఇచ్చింది. ఇవాళ మోడీ సర్కార్ పై లోక్‌ సభలో అవిశ్వాస తీర్మానం పెట్టింది BRS పార్టీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version