BJP లో BRS విలీనం చేసే ప్రయత్నం చేస్తున్నారని… కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ చిట్ చాట్ లో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ… తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవని, తాను కేసీఆర్ లాగా తిక్కదాన్ని.. ఎవరికి భయపడనని అన్నారు.

బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలని చూస్తున్నారని, బీజేపీలో విలీనం చేయొద్దని తాను సూచించినట్టు పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేసే తీరు ఇదేనా అని ప్రశ్నించారు.అటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. కేటీఆర్ లక్ష్యంగా పరోక్ష విమర్శలు చేశారు. తనకు కేసీఆరే నాయకుడు అని చెప్పడం ద్వారా కేటీఆర్ తనకు నేత కాదని తేల్చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ ట్విట్టర్కే పరిమితమైతే పార్టీ నడిచేది ఎలా అని ప్రశ్నించడం ద్వారా కేటీఆర్ అధికారాలను సూటిగా ప్రశ్నించారు. పార్టీ చేయాల్సిన పనులను సగం వరకూ తానే చేశానని చెప్పడంతో.. ఆమె కొత్త పార్టీ పెడుతున్నారు అనే వార్తలకు ఆద్యం పోసినట్లయింది.