రాఖీ స్పెషల్.. ఎమ్మెల్సీ కవిత ఎమోషనల్ ట్వీట్

-

తెలంగాణ వ్యాప్తంగా రాఖీ పండుగను అంగంరగ వైభవంగా నిర్వహిస్తున్నార. రాష్ట్రమంతటా రాఖీ పండుగ శోభ సంతరించుకుంది. సోదర, సోదరీమణుల మధ్య.. ఆప్యాయ అనురాగాలు వెల్లివిరుస్తున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులకు.. మహిళా నేతలు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు రాఖీలు కట్టారు. మరోవైపు మార్కెట్‌లలో రాఖీల కొనుగోలుతో.. సందడి వాతావరణం నెలకొంది. కొంతమంది నేతుల సోషల్ మీడియా ద్వారా తమ సోదరసోదరీమణులకు రాఖీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

రక్షా బంధన్​ పండుగను పురస్కరించుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ (ట్విటర్​) వేదికగా ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఈ పోస్టులో కవిత.. ‘అమ్మలోని మొదటి అక్షరం, నాన్నలోని చివరి అక్షరం నా “ అన్న ” అని రాసుకొచ్చారు. మంత్రి కేటీఆర్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు.

మరోవైపు రాఖీ సోదరీమణుల ప్రేమకు చిహ్నమని ఎంపీ సంతోష్‌ కుమార్‌ తెలిపారు. ఎమ్మెల్సీ కవితతో పాటు తన సోదరి సౌమ్య.. తనకు రాఖీ కడుతున్న ఫొటోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version