రైతుల వద్దకు కేసీఆర్… ఇవాళ 3 జిల్లాల్లో పర్యటన, మధ్యాహ్నం ప్రెస్ మీట్

-

KCR to farmers: కేసీఆర్‌ జిల్లాల పర్యటనకు బయలు దేరనున్నారు. నేడు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో కేసీఆర్‌ పర్యటించనున్నారు. జిల్లాల పర్యటనకు కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. ఇవాళ జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో కేసీఆర్‌ పర్యటించనున్నారు. కెసిఆర్ క్షేత్ర స్థాయిలో పంటల పరిశీలనకు కెసిఆర్ రానున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.

KCR to farmers

ఇక ఇవాళ మొదటగా పాలకుర్తి నియోజకవర్గంలో కేసీఆర్‌ పర్యటన ఉంటుంది. ఈ సందర్భంగా ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు కేసీఆర్. ఇవాళ ఉదయం 10.30 కు జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలం దారవత్ తండా లో ఎండి పోయిన పంటల పరిశీలించనున్నారు. అనంతరం 11.30 కు సూర్యాపేట జిల్లా లోని అర్వపల్లి లో ఎండి పోయిన పంటల పరిశీలించనున్నారు కేసీఆర్‌. మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్‌ ప్రెస్‌ మీట్‌ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version