ముగిసిన కాళేశ్వరం విచారణ… నేరుగా ఆస్పత్రికి కేసీఆర్

-

KCR went to hospital: కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ విచారణ ముగిసింది. దాదాపు 50 నిమిషాల పాటు వన్ టు వన్ విచారణ సాగింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రశ్నించారు జస్టిస్ పీసీ ఘోష్. పలు డాక్యుమెంట్ లను కమిషన్ కు అందజేశారు కేసీఆర్. ఇప్పటి వరకు 114 మందిని విచారించింది కమిషన్.

KCR went to hospital
KCR went to hospital

కాళేశ్వరం కమిషన్ విచారణకు 115వ వ్యక్తిగా కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ విచారణతో కమిషన్ ఎంక్వయిరీ పూర్తి అయింది. జులై చివరి వారంలో ప్రభుత్వానికి కమిషన్ పూర్తి నివేదిక ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక అటు కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తి కాగానే, ఆస్పత్రికి వెళ్లారు కేసీఆర్. ప్రమాదవశాత్తూ కాలు జారి పడి సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించేందుకు బయల్దేరారు కేసీఆర్.

 

Read more RELATED
Recommended to you

Latest news