ముస్లింలపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

ముస్లింలపై కేంద్రమంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కేంద్రమంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రజలందరికీ బోనాలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా,.. కరోనా లాంటి మహమ్మారి ప్రబల కుండా ఉండాలని అమ్మవారిని ప్రార్థించుకున్నట్లు తెలిపారు.

దీంతో అంబర్ పేట ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. ఫ్లైఓవర్ నిర్మాణం పనుల జాప్యంపై స్పందించిన కేంద్రమంత్రి భూసేకరణ సమస్యలు ఉన్నాయన్నారు. అక్కడ ఉన్న ముస్లిం శ్మశాన వాటిక ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ముందు ఒప్పుకున్నా,… ఇప్పుడు అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తక్షణమే స్పందించి ముస్లింలను ఒప్పించాలని కోరారు.ఫ్లైఓవర్ కడుతున్నదే,.. శ్మశానానికి అడ్డంకిగా ఉండకూడదనీ,.. దీన్ని ముస్లింలు అర్థం చేసుకోవాలని కోరారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version