కేసీఆర్ ఒక విచిత్రమైన జంతువు… ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు – కిషన్‌ రెడ్డి

-

కేసీఆర్ ఒక విచిత్రమైన జంతువు… ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కిషన్‌ రెడ్డి. ఇవాళ మీడియాతో కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ… మోడీకి ప్రత్యామ్నాయం లేదు.. ఏ పార్టీ కూడా మోడీకి ప్రత్యామ్నాయం కాదు..ఏ ఇంట్లో చూసిన.. ఎవరి నోట విన్న ఒక్కటే మాట మోడీ మోడీ అంటున్నారన్నారు.

kishan reddy

దేశంలో మాఫీయా లేదు.. గుండాయిజం లేదు.. మోడీ వచ్చాక దేశం శాంతియుతంగా ఉంది..దేశం మోడీ చేతిలో ఉంటేనే భద్రంగా ఉంటుందని చెప్పారు. మోడీ ఒక్కసారి కూడా సెలవు తీసుకోలేదు..మోడీ ప్రధాని అయినప్పుడే.. కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి అయ్యాడని తెలిపారు. కేసీఆర్ ఒక్కరోజు కూడా ఆఫీస్ కు రాలేదు..అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ మొత్తం ఫాం హౌజ్ లోనే ఉన్నాడని విమర్శలు చేశారు. కేసీఆర్ ఒక విచిత్రమైన జంతువు.. ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదన్నారు కిషన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version