కొండా మురళి హాట్ కామెంట్స్ చేశారు. కొండా సురేఖ ఖర్చులకు నేనే నెలకు రూ.5 లక్షలు పంపుతానంటూ బాంబు పేల్చారు కొండా మురళి. కొండా సురేఖకు మంత్రి పదవి పోతుంది అని కొందరు అంటున్నారు… రేవంతన్న, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్నాక మన మంత్రి పదవి ఎక్కడికి పోతుంది? అని ప్రశ్నించారు.

కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు అన్నారు. అటు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీసాలు, గడ్డం గీసుకునే వాళ్ళను చూసి ఉంటాం.. కనుబొమ్మలు గీసుకునే నాయకుడిని ఎప్పుడైనా చూశామా? అని పేర్కొన్నారు. వరంగల్ జిల్లాకు చెందిన కనుబొమ్మలు లేని నాయకుడు 15 ఏళ్లు టీడీపీని భ్రష్టు పట్టించాడు.. చంద్రబాబును ఓడగొట్టాడు.. అతను మాత్రం మంత్రి పదవి అనుభవించాడని పేర్కొన్నారు.