కౌలు రైతులకు రైతు భరోసా లేదని తుమ్మల ప్రకటన..కేటీఆర్‌ కౌంటర్‌ అదుర్స్‌ !

-

కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి తుమ్మల కుండా బద్దలు కొట్టాడని…. కౌలు రైతులను నమ్మించి తడి గుడ్డతో గొంతు కోసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కేటీఆర్‌ ఆగ్రహించారు. ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటకా బోడి మల్లన్న అన్నటుంది కాంగ్రెస్ పాలనా ఉందన్నారు. అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నారు ఇప్పుడు.

రైతు భరోసా, రుణమాఫీ పై ఎన్నికల వేల బీరాలు పలికి ముఖ్యమంత్రి ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాడని ఆగ్రహించారు. తాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతన్నలను అయోమయానికి గురిచేస్తున్నాయన్నారు. మొన్న రుణమాఫీ పేరిట మోసం చేశారని… నిన్న వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టారు. నేడు కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా ? అని మండిపడ్డారు కేటీఆర్‌.కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పిందేంటి..? చేస్తున్నదేంటి..? 420 హామీ ల్లో ఒక్కో వాగ్దానాన్ని సీఎం పాతరేస్తున్నారు ? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version