కాంగ్రెస్‌ లో రేవంత్ రెడ్డి… ఎక్ నాథ్ షిండేగా మారతాడు – కేటీఆర్

-

కాంగ్రెస్ పార్టీలో రేవంత్… ఎక్ నాథ్ షిండేగా మారతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌. తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడుతావ్ ? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సీరియస్‌ అయ్యారు కేటీఆర్‌. 100 మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూసుకుందాం కానీ వంద రోజుల్లో నెరవెరుస్తామన్న హామీలను అమలు చేసే అంశం పైన దృష్టి పెట్టు రేవంత్ రెడ్డి అని చురకలు అంటించారు. అహంకారంతో మాట్లాడిన రేవంత్ రెడ్డి లాంటి నాయకులను టిఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానంలో చాలామందిని చూసిందని స్పష్టం చేశారు.

ktr on revanth and rahul

రేవంత్ రెడ్డి లాంటి నాయకులను వేల మందిని బీఆర్ఎస్ పార్టీ చూసిందని.. అయినా రెండున్నర దశాబ్దాలు పార్టీ నిలబడి, నీలాంటి వాళ్ళను మట్టికరిపించిందని గుర్తించారు. తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడుతావ్ … తెలంగాణ తెచ్చినందుకా… తెలంగాణను డెవలప్ చేసినందుకా… మిమ్మలను, మీ దొంగ హమీలను ప్రశ్నిస్తునందుకా అంటూ ఆగ్రహించారు కేటీఆర్‌. కాంగ్రెస్, బీజేపీలు పార్లమెంట్ ఎన్నికల తర్వతా కలిసిపోతాయని.. రేవంత్ కాంగ్రెస్ ఎక్ నాథ్ షిండేగా మారతాడని బాంబ్‌ పేల్చారు కేటీఆర్‌. రేవంత్ రక్తం అంత బిజెపిదే…ఇక్కడ చోటా మోడీగా రేవంత్ రెడ్డి మారాడని…గతంలో అదాని గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు ఆదాని కోసం వెంటపడుతున్నాడని నిప్పులు చెరిగారు కేటీఆర్‌. స్విట్జర్లాండ్ లో రేవంత్ రెడ్డి అదానితో అలైబలై చేసుకున్నాడు…అదాని రేవంత్ రెడ్డి ఒప్పందాల అసలు, లొగుట్టు బయటపెట్టాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news