గచ్చిబౌలి ఏఐజి ఆసుపత్రికి చేరుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణ వార్త అనంతరం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు కేటీఆర్.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపినాథ్ గారి అకాల మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి మాగంటి గోపినాథ్ చేసిన కృషిని గుర్తు చేసుకున్న కేటీఆర్… మాగంటి గోపినాథ్ కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.