రేపే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. గులాబీ శ్రేణులకు కేటీఆర్ కీలక పిలుపు

-

బీఆర్ఎస్ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లా పార్టీల కార్యాలయాలలో పార్టీ జెండాను ఎగురవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల కార్యక్రమాల్లో పార్టీ యావత్ పూర్తిగా నిమగ్నమైన నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను జిల్లా కార్యాలయ కేంద్రంగా జరుపుకోవాలని సూచించారు. జిల్లా పార్టీ కార్యవర్గంతో పాటు, పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొంటారని తెలిపారు.

KTR sensational announcement on Khammam MP positionKTR

పార్టీ కార్యకర్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు పార్టీ తరపున ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఏప్రిల్ 27, 2001 తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం పుట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పార్టీ అహర్నిశలు చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పరిణితి చెంది రైతుల కోసం, శ్రామికుల కోసం, కర్షకుల కోసం, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి  కోసం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. తెలంగాణ భవన్ లో రేపు కేటీఆర్ ఉదయం 9 గంటలకు జెండాను ఆవిష్కరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version