మూసారాంబాగ్‌ బ్రిడ్జి దగ్గరకు కొట్టుకువచ్చిన లక్ష్మీ మృతదేహం

-

హైదరాబాద్‌ లోని మూసారాంబాగ్‌ బ్రిడ్జి దగ్గర మూసీలో లక్ష్మీ మృతదేహం కొట్టుకువచ్చింది. దాదాపు 4 రోజుల క్రితం హుస్సేన్‌సాగర్‌ నాలాలో గల్లంతైంది లక్ష్మీ అనే మహిళ. అయితే.. హైదరాబాద్‌ లోని మూసారాంబాగ్‌ బ్రిడ్జి దగ్గర మూసీలో లక్ష్మీ మృతదేహం కొట్టుకువచ్చింది. ఇక ఈ తరుణంలోనే ఇవాళ తన తల్లి మృతదేహాన్ని గుర్తించిన లక్ష్మీ కూతురు… బోరున విలపించింది.

laxmi-Body-In-Musi-River

మా అమ్మ మాకు దూరం అయిందని.. ఎడమ చేతిపై తన స్నేహితురాలి పచ్చబొట్టు పేరు కమలమ్మ అని రాయించుకుందని వెల్లడిచింది లక్ష్మీ కూతురు. ముక్కుపుల్ల మరియు పచ్చబొట్టు దాని ఆధారంగా మా అమ్మ మృతదేహం గా గుర్తుచానని తెలిపింది. తన తల్లి లక్ష్మి మృతదేహం కోసం నాలుగు రోజులు వేతికామని… అధికారులు తీవ్రంగా శ్రమించారని పేర్కొంది. ఈ రోజు మా అమ్మ మాకు లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది క్ష్మీ కూతురు.

Read more RELATED
Recommended to you

Exit mobile version