ఎక్కువ కేసులు ఉన్న టీడీపీ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు – నారా లోకేష్‌

-

ఎక్కువ కేసులు ఉన్న టీడీపీ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు అంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు తెలుగు దేశం పార్టీ అగ్రనేత నారా లోకేష్‌. యువగళం పాదయాత్రలో భాగంగా మరోసారి కార్యకర్తలను హింసకు ఉసిగొల్పేలా వ్యాఖ్యలు చేశారు నారాల లోకేష్‌. యువగళం పాదయాత్రలో భాగంగా భీమవరంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ…

2019-2024 మధ్య కాలంలో టీడీపీ కార్యకర్తల మీద ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే వారికి అంత పెద్ద నామినేటెడ్ పదవి ఇప్పిస్తానని మళ్ళీ హామీ ఇచ్చాడు. జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నుంచీ పరిశ్రమలకు పవర్ హాలీడే, వ్యవసాయానికి క్రాప్ హాలీడే ఇచ్చారంటూ మండిపడ్డారు లోకేష్‌. జగన్ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తుంటే, నేను అంబేద్కర్ గారి రాజ్యాంగం అనుసరిస్తున్నానని మండిపడ్డారు నారా లోకేష్‌. జగన్ కన్ను పడితే విధ్వంసం. అడుగు పెడితే అరిష్టం అని మరోసారి స్పష్టం అయ్యిందని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version