Telangana:లారీ డ్రైవర్ బట్టలు విప్పి చితక బాదిన కానిస్టేబుల్స్..!

-

Telangana:లారీ డ్రైవర్ బట్టలు విప్పి చితక బాదారు ఇద్దరు కానిస్టేబుల్స్. ఈ సంఘటన మహబూబబాద్‌ లో చోటు చేసుకుంది. అయితే…ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాద్ జిల్లాలోని కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు కానిస్టేబుల్ దౌర్జన్యానికి దిగారు.

lorry driver

కానిస్టేబుల్స్ సాంబయ్య, వీరన్న ఇసుక లారీ డ్రైవర్ నడిరోడ్డుపై బట్టలు విప్పి చితిక బాదారు కానిస్టేబుల్స్. రోజు మామూలు ఇవ్వాలంటూ లారీ డ్రైవర్లను బెదిరింపులకు గురి చేస్తున్నారు ఇద్దరు కానిస్టేబుల్స్. వారం రోజుల క్రితం కేసముద్రం ఫ్లైఓవర్ వద్ద ఇసుక లారీ డ్రైవర్ ను లారీ పక్కకు ఆపాలంటూ బెదిరింపులకు దిగారట.

కొద్ది దూరం ముందుకు వెళ్లడంతో లారీ డ్రైవర్ ను వెంబడించి కిందికి దింపి దాడి చేశారట కానిస్టేబుల్స్. రోజు రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయట. ఇసుక లారీలతోపాటు పాసింగ్ లోడుతో వచ్చిన లారీలను వదిలిపెట్టకుండా ఇద్దరు కానిస్టేబుల్ బెదిరింపులకు పాల్పడుతున్నట్టు లారీ డ్రైవర్లు ఆరోపణలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version