క్రిశాంక్ ను ఇంటికి వచ్చి కొడతాం – కాంగ్రెస్ హెచ్చరిక !

-

బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ ను ఇంటికొచ్చి కొడతాం అని మీడియా సాక్షిగా వార్నింగ్ ఇస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. Brs సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ పై మాదాపూర్ పీఎస్ లో కేసు నమోదు అయింది. ప్రజా పాలన కు వ్యతిరేకంగా, సీఎం రేవంత్ రెడ్డి పై సోషియల్ మీడియా లో పోస్ట్ లు పెట్టారట క్రిశాంక్.

అలాగే… సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల మహానంద రెడ్డికి సంబంధిత పోస్ట్ పెట్టినందుకు బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిశాంక్ ఫోన్ సీజ్ చేశారు మాదాపూర్ పోలీసులు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.

క్రిశాంక్ ఫోన్ సీజ్ చేసి 41 CRPC కింద నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయితే.. ఈ వివాదంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ కు కాంగ్రెస్‌ వార్నింగ్‌ ఇచ్చింది. రేవంత్ రెడ్డి మీద ఇంకోసారి మాట్లాడితే బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్.. నీ ఇంటికి వచ్చి కొడతాం అని మీడియా ముందే వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్‌ నేతలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version