Warangal: అమ్మాయితో ప్రేమ, సహజీవనం…అంతలోనే తల్లిదండ్రులను చంపిన యువకుడు!

-

Warangal: అమ్మాయితో ప్రేమ, సహజీవనం…అంతలోనే తల్లిదండ్రులను చంపాడు ఓ యువకుడు. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రేమించిన అమ్మాయి కుటుంబంపై విశిక్షణ రహితంగా తల్వార్ దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లా చంద్రరావు పేట మండలం 16చింతల తండాలో చోటు చేసుకుంది.

గిర్ని బాయి కి చెందిన నాగరాజు 16 చింతల తండా దీపిక ప్రేమించుకున్నారు..వీరు మూడు నెలలు సహజీవనం కూడా చేశారు..ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కాంప్రమైజ్ అయి ఎవరింటికి వారు వెళ్లిపోయారు.. మా ఇద్దరినీ విడదీశారని కోపంతో నాగరాజు ఆ కుటుంబం పై కక్షపెచ్చుకున్నాడు అర్ధరాత్రి 1:35 నిమిషాల సమయంలో మంచంలో బయట నిద్రిస్తున్న కుటుంబం పై తల్వార్ తో విచక్షణ రహితంగా దాడి చేశాడు. గాడ నిద్రలో ఉండగా దాడి చేసిన నిందితుడు..ఈ దాడిలో అమ్మాయి తల్లి బానోతు సుగుణ 40 అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి బానోతు శ్రీనివాస్ 45 వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version