మెడికల్ స్టూడెంట్ ను హతమార్చిన మావోయిస్టులు..!

-

మెడికల్ స్టూడెంట్ రాధాను మావోయిస్టులు చంపేశారు. ఆరేళ్ల క్రితం రాధా అలియాస్ నీల్సో మావోయిస్టు పార్టీలో చేరింది. కానీ ఆమె పోలీసులకు కోవర్టు మారిందని సమాచారంతో మరణశిక్ష విధించింది మావోయిస్టు పార్టీ. పోలీసులకు లొంగిపోయి రాధా సోదరుడు సూర్యం ఏజెంట్ గా పని చేస్తున్నాడంటూ లేఖలో పేర్కొంది మావోయిస్టు పార్టీ. రాధాపై అనుమానం రావడంతో 3 నెలల క్రితం ఆమెను కమాండర్ బాధ్యతల నుండి సస్పెండ్ చేసింది మావోస్ట్ పార్టీ.

అయితే తెలంగాణ ,చత్తీస్గడ్ ఇంటలిజెన్స్ అధికారుల తో రాధా సంబంధం పెట్టుకున్నట్లు మావోయిస్టు పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. రాధా పార్టీ కీలక సమాచారాన్ని ఇంటెలిజెన్స్ పోలీసులకు వెల్లడించింది అంటూ లేఖలో తెలిపింది మావోయిస్టు పార్టీ. అందువల్లే రాధాకు మరణశిక్ష విధించినట్లు మావోయిస్టు పార్టీ పేర్కొంది. అయితే గతంలో రాధాను మావోయిస్టు పార్టీ వైపు శిల్పా, దేవేంద్ర అనే వ్యక్తులు మళ్లించారు. ఈ శిల్పా కేసులో ఏపీ, తెలంగాణలో గతంలో సోదాలు చేసి పలువురిని NIA అరెస్టు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news