కాంగ్రెస్‌ పార్టీలోకి తాటికొండ రాజయ్య..క్లారిటీ ఇచ్చిన దామోదర !

-

 

వరంగల్ లో తాటికొండ రాజయ్య, కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ సమావేశం అయ్యారు. అయితే.. కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహతో భేటీపై స్పందించలేదు రాజయ్య. నోకామెంట్ అంటూ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయిన రాజయ్య… రాజయ్య వెళ్లిన అనంతరం మీడియాతో మాట్లాడారు దామోదర రాజనర్సింహా.

Meeting between Tatikonda Rajaiah and Congress leader Damodara Rajanarsimha

మా భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని వెల్లడించారు దామోదర రాజనర్సింహా. ఇంటలెక్చువల్ ఫోరం సమావేశం సందర్భంగా రాజయ్య సమావేశంలో పాల్గొన్నారు. మాదిగల రాజకీయంగా ఎదిగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశం పైన మేదావులు కొన్ని సూచనలు చేశారని వెల్లడించారు కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ.. మాదిగల సబ్ ప్లాన్ అమలు పైనా చర్చ జరిగింది..జమిలికి కాంగ్రెస్ సిద్దం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పోటీకి రెడీగా ఉందని స్పష్టం చేశారు దామోదర రాజనర్సింహా.

Read more RELATED
Recommended to you

Exit mobile version