టిఆర్ఎస్ అసమర్థ పాలన వల్ల పాలమూరులో వలసలు ఆగాయా: బండి సంజయ్

-

16వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా బస్సులో ప్రయాణికుల యోగక్షేమాలు తెలుసుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.ఉమ్మడి పాలమూరు జిల్లాలో వలసలు ఆగాయని టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బొంబాయి వెళ్తున్న బస్సు ఎక్కి ప్రయాణికులతో మాట్లాడారు.తామంతా పొట్ట చేతపట్టుకొని బొంబాయి వెళ్తున్న కార్మికులమని బండి సంజయ్ కి తెలిపారు.

 

నిత్యం ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులు బొంబాయి కి వలసకూలీల తో వెళ్తున్నాయని..ఇది ముఖ్యమంత్రికి కనిపించడం లేదా అని బండి ప్రశ్నించారు.ప్లీనరీలో వలసలు ఆగాయని తమ కార్యకర్తలకు సిఎం కెసిఆర్ అబద్ధాలు చెప్పారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.టిఆర్ఎస్ అసమర్థ పాలన లో బతికే దారి లేక ఉపాధి దొరక్క రోజూ వందల మంది ముంబైకి వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version