కొత్త రేషన్ కార్డుల మంజూరు పై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన..!

-

కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం మంత్రికి కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కెసిఆర్ రాకతో కామారెడ్డి జిల్లా దశ దిశ మారబోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయం అన్నారు. వచ్చేలా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. రేషన్ కార్డులకు సన్న బియ్యం ఇస్తామని భరోసా ఇచ్చారు. తెల్ల రేషన్ కార్డుదారులకు ఐదు లక్షల బీమా ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని వెల్లడించారు.

దసరా వారిగా పెన్షన్స్ రూపాయలు ఐదువేలకు పెంచుతామని చెప్పారు. అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్న వారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇంకా సినిమా అయిపోలేదు.. కాంగ్రెస్ బిజెపిలకు ముందు ముందు మంచి సినిమా చూపిస్తామని పేర్కొన్నారు కేటీఆర్. ప్రజల మద్దతు లేని కాంగ్రెస్ పార్టీ అప్పుడే కాదు అధికారంలోకి వస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ ప్రమాణస్వీకారం డేట్లు ఫిక్స్ చేసుకుంటున్నారు అన్నారు. కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version