‘అభయహస్తం’లో పైరవీలకు అవకాశం లేదు: పొన్నం

-

తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. జనవరి 6వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ నేపథ్యంలో 10 ఉమ్మడి జిల్లాల్లో ఈ కార్యక్రమానికి సంబంధించి మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ బంజారాహిల్స్లో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభయహస్తం గ్యారంటీ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో పైరవీలకు ఎలాంటి అవకాశం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఎవరైనా పైరవీ చేయిస్తానంటే నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. నేటి నుంచి జనవరి 6వ తేదీ వరకు ‘అభయహస్తం’ గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని చెప్పారు. ప్రజలకు సందేహాలుంటే అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ప్రజల వద్దకే పాలన పేరుతో హైదరాబాద్‌లో 600 కేంద్రాల్లో కార్యక్రమం జరుగుతోందన్న మంత్రి పొన్నం ప్రభాకర్ అర్హతను బట్టి లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news