KCR ప్రతిపాదిస్తే.. కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు అయ్యారు – మంత్రి పొన్నం

-

KCR ప్రతిపాదిస్తే.. కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు అయ్యారని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ లో కార్యకర్తల సమావేశానికి హాజరైన బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్…అనంతరం మాట్లాడారు. 6గ్యారంటీలను పక్క గా అమలు చేస్తాం.. వాటి అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అధికారంలోకి వచ్చి నెల కాలేదు 420 ముద్ర వేసి ప్రచారం చేయడం సరి కాదు…సెక్షన్ 379 ,384 ,393 395 సెక్టన్లు బిఆరెస్ నాయకులకు అప్లికేబుల్ అవుతాయని తెలిపారు.

స్లిప్పర్ చెప్పులతో వచ్చిన వారికి వందల కోట్ల ఫామ్ హౌజ్ లు ఎలా వచ్చాయి…7లక్షల కోట్ల అప్పు చేసింది బిఆరెస్ ప్రభుత్వం అని ఫైర్‌ అయ్యారు. Kcr ప్రతిపాదిస్తే కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు అయ్యారు… కిషన్ రెడ్డి కేసీఆర్ బినామీ అంటూ నిప్పులు చెరిగారు. ఆటో డ్రైవర్లు మా కుటుంబ సభ్యులు
మహిళలకు బస్ ఉచిత ప్రయాణం Brs కి ఇష్టం ఉందా లేదా…..ఆటో డ్రైవర్లను రెచ్చగొడుతున్నారని ఆగ్రహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలగొట్టే పరిస్థితి ఉంది.. రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దేవాదుల, ఎస్సారెస్పీ ద్వారా నీరందించే పనులు చేపడుతామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version