అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్.. !

-

అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. ఏపీ అసెంబ్లీ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు బహిష్కరించారు. అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

YCP members walked out from AP Assembly

ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు బొత్స సత్యనారాయణ. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం అన్నారు. 9 నెలలు అయింది.. సూపర్ సిక్ ఎక్కడ? అంటూ నిలదీశారు బొత్స సత్యనారాయణ. ప్రజల్ని మోసం చేయడం ధర్మం కాదని ఆగ్రహించారు. అసెంబ్లీ కి రావాల వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయం పై ఆధారపడి ఉందని వివరించారు బొత్స సత్యనారాయణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version