భూపాలపల్లి సీటు నాదే.. గెలుపు నాదే – ఎమ్మెల్యే గండ్ర

-

భూపాలపల్లి సీటు నాదే.. గెలుపు నాదేనని టీఆర్‌ఎస్‌ పార్ట ఎమ్మెల్యే గండ్ర ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. 2023 ఎన్నికల్లో భూపాలపల్లి టికెట్ తనకే వస్తుందని… గెలిచేది నేనె అని కళాఖండిగా చెబుతున్నానని వెల్లడించారు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి. భూపాలపల్లి లో 168 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

100 పడకల ఆస్పత్రిలో 70 పోస్టులు మంజూరు చేశారని.. 80 కోట్లా రూపాయలతో సైడ్ డ్రైన్స్.. రోడ్డు వైడింగ్ కూడా చేస్తున్నట్లు వివరించారు. రూ.17 కోట్లతో అన్ని వసులతో కూడిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తున్నామ ని.. కాబట్టి …2023 ఎలక్షన్ లో నేనె పోటీ చేస్తా… సిటు నాదే గెలుపు నాదే అంటూ భావోద్వేగంగా మాట్లా డారు ఎమ్మె ల్యే గండ్ర. కాగా.. గత 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మధుసుధనాచారీ పై కాంగ్రెస్‌ అభ్యర్థిగా గండ్ర వెంకటరమణ రెడ్డి గెలిచారు. అనంతరం.. టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version