BRS ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టి..కాంగ్రెస్ పార్టీలోకి లాగాలని చూస్తుంది – మహిపాల్ రెడ్డి

-

BRS ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టి..కాంగ్రెస్ పార్టీలోకి లాగాలని చూస్తుందని సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ తెల్లవారుజామున పటాన్చెరులోని ఆయన నివాసానికి వచ్చిన పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సంఘటనపై కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..సంచలన వ్యాఖ్యలు చేశారు.

MLA Mahipal Reddy shed tears

2011-12 లో క్వారీ లీజుకు తీసుకున్నామని… గత నాలుగేళ్లుగా మేము సొంతంగా సంతోష్ క్రషర్లు కంపెనీ పేరుతో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మేము తప్పు చేసినట్టు రుజువు అయితే ఫెనాల్టీ వేయండి….కానీ తెల్లవారుజామున 3 గంటలకు వందల మంది పోలీసులు వచ్చి అక్రమ అరెస్టులు చేశారని ఆగ్రహించారు. కాంగ్రెస్ వచ్చిన 100 రోజుల్లో BRS ఎమ్మెల్యేలు, నేతలపై కేసులు పెడుతున్నారని ఆగ్రహించారు. పటాన్ చెరులో 40 క్రషర్లు ఉన్నాయి..అందులో చాలా వాటికి లైసెన్స్ అయిపోయిన నడుస్తున్నాయని వివరించారు. మా దగ్గర ఆధారాలతో క్వారీకి సంబంధించిన అన్ని పర్మిషన్లు ఉన్నాయన్నారు మహిపాల్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version